హైదరాబాద్ : తెలంగాణలోని జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రాకేశ్ అనే యువకుడు దుబాయ్ లో పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మనీషా అనే యువతిని రాకేశ్ ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వారి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించారు. కానీ ఏమైందో కానీ నిన్న మనీషా తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందనే వార్త విని రాకేశ్ తట్టుకోలేకపోయాడు. 'నీవు లేని జీవితం నాకు వద్దు. అమ్మా నన్ను క్షమించు. మిమ్మలను విడిచి వెళ్తున్నా'అని సెల్ఫీ వీడియో తీసుకుని దుబాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమికులు ఇద్దరూ చనిపోవడంతో గ్రామం విషాదంలో మునిగిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm