హైదరాబాద్: పిఆర్సీ సత్వర అమలు కోరుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 23న (శనివారం) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు హైదరాబాద్ ధర్నా చౌక్ నందు ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టనున్నారు. అదేరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, మండల కేంద్రాలు, విద్యాసంస్థల్లో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శుక్రవారం తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు సిహెచ్ సంపత్ కుమార్ స్వామి, జి సదానందం గౌడ్, కె జంగయ్య, ఎ రాజేంద్రబాబు, కె రమణ, చావ రవి, మైస శ్రీనివాసులు, ఎ శ్రీను నాయక్, జి నిర్మల, ఎన్ యాదగిరి, ఎన్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..2018 మే 16న కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగులు పిఆర్సీ అమలు కోసం గత ముప్పై నెలలుగా ఎదురు చూస్తున్నారు. నివేదిక సమర్పించి మూడు వారాలు గడచినా పిఆర్సీ సిఫారసులను వెల్లడించలేదు. పత్రికలలో వచ్చే ఊహాగానాలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో గందరగోళానికి, ఆందోళనకు కారణమౌతున్నాయి. ఈ నేపధ్యంలో పిఆర్సీ సత్వర అమలు, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు, ముఖ్యమంత్రి హామీల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఐక్యవేదిక పోరాటానికి పిలుపు నిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చినా స్పందనలేదు. ఇప్పటికైనా అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరాటానికి సిద్ధం కావాలని, ఐక్యవేదిక పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో
ఫిబ్రవరి నెలలో రాష్ట్ర స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను కదిలించి ప్రత్యక్ష కార్యాచరణను చేపట్టనున్నట్లు ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ ప్రకటించింది.
డిమాండ్స్:
1. పిఆర్సీ నివేదికను వెంటనే బహిర్గతం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
2. ఈ నెలాఖరులోగా సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ తో 1.07.2018 నుండి నూతన వేతనాలు అమలు చేయాలి.
3. 16 మే 2018 న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలి.
4. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.
5. సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్దరించాలి. 1.09.2004 కు ముందు ఎంపిక ప్రక్రియ పూర్తై తర్వాత నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 Jan,2021 03:10PM