హైదరాబాద్ : లాలాపేటలో డయాగ్నస్టిక్స్ కేంద్రాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. బస్తీ దవాఖానాలకు వెళ్లే రోగుల కోసం ఈ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 8 డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో అన్నిరకాల పరీక్షలను ఉచితంగా చేస్తామన్నారు. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, రేడియాలజీ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే మరో 8 డయాగ్నస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటుచేస్తామని మంత్రి ఈటల వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో రూ.35 కోట్లతో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. 8 ఆపరేషన్ థియేటర్లతో అవయవ మార్పిడి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆధునిక సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. నగరంలో ల్యాబ్లు విజయవంతమైతే జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తామని ఈటల స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm