హైదరాబాద్ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని రైతులు తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు కేంద్రానికి, రైతులకు మధ్య 11వ విడత చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో అనుసరించాల్సిన విధానంపై కేంద్ర హో మంత్రి అమిత్షాతో వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చర్చించారు. కొత్తసాగు చట్టాల విషయంలో ఓ పరిష్కారం లభించే వరకు వాటి అమలును ఏడాది లేదా ఏడాదిన్నర పాటు నిలిపేస్తామని..అప్పటి వరకూ ఉద్యమాన్ని నిలుపుదల చేయాలంటూ కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు తోసిపుచ్చాయి. బుధవారం జరిగిన 10వ విడత చర్చల్లో కేంద్రం ఈ ప్రతిపాదనను రైతు సంఘాల ఎదుట ఉంచగా దానిపై గురువారం రోజు సంయుక్త కిసాన్ మోర్చా పూర్తిస్థాయిలో సాధారణ సమావేశాన్ని నిర్వహించి చర్చించింది. దాదాపు 4 గంటలపాటు చర్చించిన రైతు నేతలు కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించాలని తీర్మానించారు. సాగు చట్టాలను.. రద్దు చేయాల్సిందేనని మద్దతుధరకు చట్టం చేయడం సహా పెండింగ్లో ఉన్న అన్ని డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని రైతులు నిన్న స్పష్టం చేశారు. చట్టాల రద్దుకు ప్రభుత్వం అంగీకారం తెలిపే వరకు ఉద్యమాన్ని వదిలి ఇళ్లకు వెళ్లేది కూడా లేదని రైతులు తేల్చి చెప్పారు.
ఈ ఉద్యమం సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన.. 143 మంది అన్నదాతలకు నివాళులు అర్పించిన రైతు సంఘాలు.. వారు తమతో లేకున్నా వారు నింపిన స్ఫూర్తి తమతోనే ఉందని.. వారి ఆశయాన్ని సాధించి తీరుతామని రైతులు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 Jan,2021 07:02AM