హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్లో టీమిండియా సాధించిన విజయంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సరదాగా స్పందించాడు. మరీ ఇంత ఘోరంగా ఆసీస్ను ఓడించడం ఏమీ బాగాలేదన్న పీటర్సన్.. ఇంతటి అద్భుత ఘట్టానికి వేదికయ్యే అర్హత బ్రిస్బేన్కు లేదంటూ చమత్కరించాడు. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే మంగళవారం నాటి మ్యాచ్లో పంత్ అనే కుర్రాడు, పెద్దవాడిగా మారిపోయాడంటూ అద్భుత ఇన్నింగ్స్ను కొనియాడాడు. మొత్తానికి టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందంటూ హర్షం వ్యక్తం చేశాడు. అదే విధంగా... ఎన్నో అడ్డంకులు అధిగమించి భారత జట్టు ఈ చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే రానున్న కొన్ని వారాల్లో మీకు అసలైన సవాలు ఎదురుకాబోతోంది. ఇంగ్లండ్ జట్టు పర్యటనకు వస్తోంది. మీ సొంతగడ్డపై వారిని ఓడించాల్సి ఉంటుంది. జాగ్రత్త. వేడుకలు చేసుకోవడం కాస్త ఆపేయండి అని పీటర్సన్ ట్వీట్ చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm