హైదరాబాద్ : కేవలం 60 నిమిషాల్లో వారు పెట్టిన భోజనం తింటే.. 1.65లక్షల విలువ చేసే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీ సొంతం అవుతుంది. అక్కడే ఉంది అసలు ట్విస్ట్.. విషయం ఏంటంటే.. వారు వడ్డించే భోజనం ఖరీదు అక్షరాలా రూ.2,500 మాత్రమే. వివరాల ప్రకారం.. పుణె శివారులోని వాడ్గావ్ మావల్ ప్రాంతంలో ఓ హోటల్ ఉంది.. కరోనా దెబ్బ హోటల్ రంగాన్ని దెబ్బ కొట్టడంతో.. ఆ తర్వాత బిజినెస్ పెంచుకోవడంపై ఫోకస్ పెట్టాడు యజమాని. అందులో భాగంగా బుల్లెట్ బైక్ కంటెస్ట్ ప్రకటించింది శివరాజ్ హోటల్. దానికి షరతులు వర్తిస్తాయనే బోర్డు కూడా పెట్టారు. అంటే.. ఆ హోటల్ నిర్వహకులు పెట్టే నాన్వెజ్ భోజనాన్ని కేవలం 60 నిమిషాల్లోనే ఫినిష్ చేయాలి.. అందులో 4 కిలోల మటన్, చేపలతో తయారు చేసిన 12 రకాల వంటకాలు వడ్డిస్తారు. వీటితో చేపల వేపుడు, చికెన్ తందూరీ, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, రొయ్యల బిర్యానీ.. అబ్బో ఇలా రుచికరమైన భోజనమే వడ్డిస్తారు.. దీనికి మీరు సమర్పించుకోవాల్సింది రూ.2,500గా నిర్ణయించారు. ఈ ఛాలెంజ్ను స్వీకరించి 60 నిమిషాల్లో భోజనాన్ని పూర్తి చేస్తే.. రూ.1.65 లక్షలు విలువ చేసే బుల్లెట్ మీ సొంతం అవుతుంది. ఈ ప్రకటన కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. ఈ బంపరాఫర్కు భారీ స్పందనే వచ్చింది. చాలా మంది ఈ ఛాలెంజ్లో విఫలం అయితే.. సోలాపూర్కు చెందిన సోమ్నాథ్ పవర్ అనే వ్యక్తి.. ఇన్టైంలో ఫినిష్ చేసి.. బుల్లెట్ గెల్చుకోవడం విశేషం. ఒక్క బుల్లెట్ సంగతి అలా ఉంచితే.. ఇప్పుడు శివరాజ్ హోటల్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది..
Mon Jan 19, 2015 06:51 pm