హైదరాబాద్ : ఆస్ట్రేలియాపై విజయం సాధించిన టీమ్ఇండియాను ప్రశంసించాడు ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్. సిరీస్ గెలవడానికి భారత్కు అర్హత ఉందని అన్నాడు. అయితే టీమ్ఇండియా గెలవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు. ఆస్ట్రేలియాపై భారత్ నెగ్గడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సిరీస్ గెలవడానికి భారత్కు అర్హత ఉంది. తొలి టెస్టు తర్వాత టీమ్ఇండియాకు సారథి కోహ్లీ గైర్హాజరీ, ఎక్కువ గాయాలు వెంటాడాయి. మరోవైపు ఆసీస్కు బలమైన ఆటగాళ్లు ఉన్నారు. వార్నర్ చివరి రెండు మ్యాచులకు అందుబాటులోనే ఉన్నాడు. అయినా మా గడ్డపై వారు ఎలా గెలిచారో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఏదేమైనప్పటికీ టీమ్ఇండియా కీలక సమయాల్లో బాగా ఆడింది. కానీ ఆసీస్ అలా చేయలేకపోయింది. అదే ఇరు జట్లకు తేడా అని రికీ పాంటింగ్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm