హైదరాబాద్ : ఏపీలో గడచిన 24 గంటల్లో 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 40, కృష్ణా జిల్లాలో 35, గుంటూరు జిల్లాలో 24, విజయనగరం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 4, శ్రీకాకుళం జిల్లాలో 6 కేసులు గుర్తించారు. అదే సమయంలో 231 మంది కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,86,245 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,77,443 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు..
Mon Jan 19, 2015 06:51 pm