హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ పరేడ్ కి వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్ పరేడ్ చేపట్టడం చట్ట విరుద్ధమని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దాదాపు 5000మంది ఆరోజు ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశముందని చెప్పారు. అయితే ఈ అంశం శాంతి భద్రతలకు సంబంధించినదని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై పోలీసులే తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఆ స్వేచ్ఛ వారికి ఉందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm