వరంగల్: బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు యూనివర్సిటీ నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. నాలుగేండ్ల డిగ్రీ కోర్సు బాచిలర్ ఆఫ్ నర్సింగ్ (బీఎస్సీ నర్సింగ్ ), రెండు సంవత్సరాల డిగ్రీ కోర్సు పోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (పీబీబీఎస్సీ నర్సింగ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపి ( బీపీటీ ), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ ( బీఎస్సీ ఎంఎల్టీ ) కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు కలిపించనున్నారు. అర్హులైన అభ్యర్థులు నెల 18న ఉదయం 10 గంటల నుంచి 27 వ తేదీ సాయింత్రం 7గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలి. ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.inలో చూడాలని యూనివర్సిటీ వర్గాలి ఒక ప్రకటనలో తెలిపాయి.
Mon Jan 19, 2015 06:51 pm