హైదరాబాద్ : ఈరోజు నుండి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. పలు చోట్ల వ్యాక్సిన్ తీసుకున్న కొంత మంది అస్వస్థతకు గురవతున్నారు. తాజాగా సంగారెడ్డిలోని ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్కు అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ తీసుకున్న ఏఎన్ఎం సంగీతకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొవిడ్ టీకా తీసుకున్న వెంటనే తల తిప్పుతుందని వైద్యులకు సంగీత చెప్పారు. ఆ తర్వాత ఆమె వాంతులు చేసుకోవడంతో సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఏఎన్ఎం నుంచి డాక్టర్ స్థాయి వరకు జిల్లా వ్యాప్తంగా పది వేల మంది వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. అయితే నేటి నుంచి ప్రారంభమయ్యే తొలి విడత టీకాను కేవలం 780 మందికే ఇవ్వనున్నారు. వీరందరూ ఇదివరకే కొవిడ్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇలా పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ వచ్చిన మెసేజ్ ఆధారంగా ఆరోగ్య కేంద్రానికి వెళ్లి టీకా వేసుకోవాల్సి ఉంటుంది. తొలివిడత డోస్ వేసుకున్న వారు రెండో డోస్ను సరిగ్గా 28 రోజులకు టీకా తీసుకోవాల్సి ఉంటుంది.
Mon Jan 19, 2015 06:51 pm