హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. గాంధీ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలికి తొలి టీకాను వైద్యులు ఇచ్చారు. సికింద్రాబాద్- గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సికేషన్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి ఈటల ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 140 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. తొలిరోజు 4,170 మంది వైద్యారోగ్యశాఖ సిబ్బందికి టీకాలు తీసుకోనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm