మంచిర్యాల: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామంలో 350 నాటు కోళ్లు మృతి చెందాయి. మరో 50 కోళ్లల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎంబడి బుచ్చయ్య అనే రైతు తన ఎకరం భూమిలో కోళ్ల ఫామ్ ఏర్పాటు చేసి నాటు కోళ్ల పెంపకం చేపట్టాడు. అకస్మాత్తుగా 350 కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీనితో లక్ష 50వేల రూపాయిల వరకు నష్టం వాటిల్లిందని రైతు బుచ్చయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు. బర్డ్ ఫ్లూ అనుమానంతో స్థానికులు ఆందోళనకు చెందుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm