- ఎమ్మెల్సీ కవిత గారిని కలిసిన అక్షరయాన్ సభ్యులు
- పలు నూతన పుస్తకాలను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: మహిళలపై జరుగుతున్న వేధింపులపై, అక్షరాలే ఆయుధాలుగా, తమ రచనల ద్వారా సమాజంలో మార్పునకై పాటుపడుతున్న 'అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫోరమ్' సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. 'తెలుగు మహిళా రచయితల ఫోరం-అక్షరయాన్' కు చెందిన 30మంది రచయిత్రిలు, ప్రముఖ రచయిత్రి ఐనంపూడి శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత గారిని హైదరాబాదు లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా 'https://aksharayan.org' వెబ్ సైట్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. వెబ్ సైట్ రూపకర్తలను ఎమ్మెల్సీ కవిత అభినందించారు.
అనంతరం "తమిరిశ జానకి గారి కవితల పోటీ" లో గెలుపొందిన రచయిత్రిలకు ఎమ్మెల్సీ కవిత బహుమతులు అందజేసారు. అంతేకాదు పలు నూతన పుస్తకాలను కవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, వేణుగోపాలాచారి, అక్షరయాన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీలక్ష్మి, సభ్యులు రమాదేవి కులకర్ణి, శైలజామిత్ర, సమ్మేట విజయ, పలువురు రచయిత్రులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jan,2021 07:56AM