హైదరాబాద్: నేడు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ లో ప్రారంభించనున్నారు. నల్గొండలోని బత్తాయి మార్కెట్లో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లబ్ధిదారులకు అందించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన లబ్ధిదారులకు 5వేల యూనిట్లు పంపిణీ చేయనున్నట్టు ఇప్పటికే మంత్రి ప్రకటించారు. ఈ విడతలో రూ.360 కోట్లతో ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మొదటి విడతలో 76.66 లక్షల గొర్రెల పంపిణీ లక్ష్యంగా నిర్ధేశించుకొని... ఏ-ఫేజ్లో 3.67లక్షలు, బీ-ఫేజ్లో 3.64లక్షల మందికి పంపిణీ చేసినట్టు మంత్రి వివరించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్టు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm