హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ తానే తీసుకుంటానని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డోసులు ఒకే కంపెనీవాటిని ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లోని పారిశుద్ధ్య కార్మికులకు తొలి విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందని ఈటల వివరించారు. తొలి, రెండో, మూడో విడత పరీక్షల అనంతరమే కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి మొదటి అరగంట పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. 18ఏళ్లు నిండినవారికి కరోనా టీకా ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టంచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm