ఇండోనేసియాలోని సులవేసి దీవిలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 35కు చేరింది. భూకంపం ధాటికి పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమై.. వందలాది మంది గాయపడ్డారు. భవన శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏజెన్సీ చీఫ్ డార్నో మజీద్ తెలిపారు. భవనాలు నేలమట్టమవడం వల్ల చాలా మంది చిక్కుకుపోయారని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు చెప్పారు. డిజాస్టర్ ఏజెన్సీ సమాచారం ప్రకారం మజెని ప్రాంతంలో 637 మంది, మముజు ప్రాంతంలో 20 మందికి పైగా గాయపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm