ఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అవసరమయ్యే ధనం కోసం విరాళాలను సేకరణను రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ట్రస్ట్ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను కలిసి మొదటి విరాళం స్వీకరించనున్నారు. ఇందులో ట్రస్ట్ సభ్యులైన కోశాధికారి గోస్వామి కోవింద్ దేవ్గిరి మహరాజ్, వీహెచ్పీ కార్యనిర్వహక అధ్యక్షుడు అలోక్కుమార్, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ మిశ్రా, ఢిల్లీ ఆర్ఎస్ఎస్ కాన్సుల్ జనరల్ కుల్భూషన్ అహుజా రాష్ట్రపతిని కలవనున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రపతి నుంచి విరాళాలు సేకరించడం ఇదే తొలిసారి. అలాగే ప్రతినిధుల బృందం నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ని కూడా కలిసి విరాళాల సేకరించనున్నారు. నిధుల సేకరణ శుక్రవారం ప్రారంభమై.. వచ్చే నెల 27వ తేదీ వరకు సాగనుంది. నిధుల సేకరణ కోసం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రముఖ వ్యక్తులతో కమిటీలను ట్రస్ట్ ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm