ఇండోనేసియా: ఇండోనేసియాలో 62మంది ప్రయాణికులతో అదృశ్యమైన విమానం సముద్రంలో కూలిపోవడం పెను విషాదం నింపింది. ఈ ఘోర ప్రమాదంలో మృతులు, విమాన శకలాలను గుర్తించేందుకు ప్రభుత్వం అన్వేషణ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో వైమానిక అన్వేషణను మరింతగా పెంచినట్టు రెస్క్యూమిషన్ సమన్వయకర్త రస్మాన్ తెలిపారు. తద్వారా సముద్ర ప్రవాహంలో విమాన శిథిలాలు, బాధితులను గుర్తించే వీలుంటుందని తెలిపారు. శ్రీవిజయ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ ఫ్లైట్ నుంచి విడిపోయిన కాక్పిట్ వాయిస్ రికార్డర్ కోసం డైవర్లు థౌజెండ్ ఐలాండ్లోని జావా సముద్ర తీర ప్రాంతాల్లో గాలింపును మరింత ముమ్మరం చేశారు. మరోవైపు, మంగళవారం రోజున విమానం డేటాతో ఉన్న బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఇప్పటికే కొన్ని విమాన శకలాలు, మానవ అవశేషాలను కూడా సహాయక సిబ్బంది గుర్తించారు.
సహాయ చర్యలలో భాగంగా గాలింపు చర్యల కోసం 4100 మంది సహాయక సిబ్బంది, 13 హెలికాఫ్టర్లు, 55 ఓడలు, 18 రాఫ్ట్ బోట్లను రంగంలోకి దించినట్టు నేవీ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 141 మానవ అవశేషాలతో కూడిన బ్యాగులను పోలీస్ ఐడెంటిఫికేషన్ ఎక్స్పర్ట్లకు పంపారు. అలాగే, ప్రభుత్వం విపత్తు బాధిత గుర్తింపు కేంద్రం ఏర్పాటు చేయగా.. బాధితుల కుటుంబ సభ్యులు డీఎన్ఏ శాంపిల్స్ అందిస్తున్నారు. ఇప్పటివరకు ఫ్లైట్ అటెండెంట్, ఆఫ్ డ్యూటీ పైలట్తో పాటు మొత్తం ఆరుగురి మృతదేహాలను గుర్తించినట్టు ఆ కేంద్రం అధికారులు తెలిపారు. ఫ్లైట్ అటెండెంట్ ఒక్కే బిస్మా (29) అంత్యక్రియలను గురువారం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో మాస్క్లు ధరించి.. భౌతికదూరం పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 Jan,2021 10:58AM