న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారినపడి మరో ఎంపీ మృతి చెందాడు. గుజరాత్కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు అభయ్ భరద్వాజ్ కరోనాతో కన్నుమూశారు. ఈ ఏడాది ఆగస్టులో ఆయన కరోనా బారినపడటంతో రాజ్కోట్లోని ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారు. కానీ అక్కడ తీవ్ర ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిర్ అంబులెన్స్లో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అయినా పరిస్థితి మెరుగు కాక పోవడంతో భరద్వాజ్ మంగళవారం ప్రాణాలు విడిచారు. ఎంపీ అభయ్ భరద్వాజ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విటర్లో సంతాపం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm