హైదరాబాద్: కరోనా వైరస్ ప్రభావం ప్రపంచమంతా కోరలు చాచుతోంది. వయస్సుతో..ప్రాంతంతో సంబంధం లేకుండా అందర్నీ బాధిస్తోంది.కరోనా మహమ్మరి నుంచి కోలుకున్నవారి పలు ఆనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కరోనా కోలుకున్నవారిలో కొందరి వ్యవహారశైలిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొందరిలో కంటిచూపు మసబారడమే కాకుండా, మతిమరపు సమస్యలు ఎదుర్కొంటున్నారు. యూపీకి చెందిన ఒక బ్యాంకు ఆఫీసర్ కరోనా బారినపడి 16 రోజుల తర్వాత కోలుకున్నారు. తరువాత అతనికి తీవ్రమైన తలనొప్పి ప్రారంభమైంది. దీంతో వైద్యులను సంప్రదించగా, వారు అతని సమస్యను గుర్తించి, చికిత్స అందించారు. చికిత్స అనంతరం అతను బ్యాంకుకు చేరుకున్నాక కంప్యూటర్ మొదలుకొని, కరెన్సీ చెస్ట్ లాక్కు సంబంధించిన అన్ని పాస్వర్డ్లను మరచిపోయారు. దీంతో వాటినన్నింటినీ రీసెట్ చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఆ బ్యాంకు ఆఫీసర్ కంప్యూటర్ ఫంక్షనింగ్ కూడా మరచిపోయారు. ఇతనిని పరీక్షించిన వైద్యులు ఈ సమస్యను ‘బ్రెయిన్ ఫాగ్’గా పేర్కొన్నారు. కాన్పూర్లో ఇటువంటి నాలుగు కేసులు వెలుగు చూశాయి. ఈ సందర్భంగా కన్పూర్ మెడికల్ కాలేజీ న్యూరాలజీ హెడ్ ప్రొఫెసర్ అలోక్ వర్మ మాట్లాడుతూ కరోనా వైరస్ నరాలలోని రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. ఇదేవిధంగా దీర్ఘకాలం పాటు ఆక్సిజన్ సపోర్టుపై ఉన్న బాధితుల మెదడులోని నరాలు బలహీనపడతాయి. ఫలితంగా నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి ‘బ్రెయిన్ ఫాగ్’ సమస్య వృద్ధులలో కనిపిస్తోంది. దీని నివారణకు రెండు నుంచి మూడు నెలల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm