హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ కి వచ్చిన మంత్రి అమిత్ షా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీట్లు పెంచుకోవడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. మేయర్ సీటు గెలుచుకోవడానికే పోటీ చేస్తున్నామన్నారు. బీజేపీ అభ్యర్థే మేయర్ అవుతాడని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ను ప్రపంచ ఐటీ హబ్గా మారుస్తామన్నారు. ఎంఐఎం అండతోనే అక్రమ కట్టడాలు ఏర్పాటయ్యాయని, ఎంఐఎం మార్గదర్శనంలోనే టీఆర్ఎస్ నడుస్తోందన్నారు. సిటీలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని అమిత్ షా ప్రశ్నించారు. కేసీఆర్ ఎవరితోనూ సమావేశం కాలేదని విమర్శించారు. తన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో లక్షా 30వేల ఇళ్ళకు కేంద్రం నిధులిచ్చిందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm