తిరుపతి: లారీకి బ్రేకులు ఫెయిల్ అయి పోలీసులు కూర్చున్న బస్షెల్టర్ను, డివైడర్ను ఢీకొన్న సంఘటన చిత్తూరు జిల్తా కెవి.పల్లి మండలం సొరకాయల పేట వద్ద నేటి ఉదయం జరిగింది. నివర్ ప్రభావంతో మండలంలోని సొరకాయల పేట కట్ట వద్ద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో వాహనాలు కట్టమీదకు వెళ్లకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. కానిస్టేబుల్ ఆదినారాయణ, సుభాష్లు విధులో ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున పాలిష్బండల లోడుతో కడప ఎర్రగుంట్ల నుంచి వస్తున్నటువంటి లారీ అదుపు తప్పి పోలీసులు కూర్చున్న బస్షెల్టర్ని, పక్కనే ఉన్న డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో కానిస్టేబులు ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm