అమరావతి: నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ రేపు ఏరియల్ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తుఫాను తీవ్రతకు గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ఏరియల్ సర్వే అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వరదపై అధికార యంత్రాంగంతో రివ్యూ మీటింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm