హైదరాబాద్ : ముంబై ఉగ్రదాడుల్లో అమరులైన జవాన్లకు మహారాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్ కోశ్యారి శ్రద్ధాంజలి ఘటించారు. నగరంలో ఉగ్రవాదుల దుశ్చర్యకు 12ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో.. అసువులు బాసిన అమరవీరులకు మహారాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధాంజలి ఘటించింది. నవంబర్ 26 దాడులనుంచి దేశాన్ని రక్షించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. గవర్నర్ భగత్సింగ్ కోశ్యారి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తదితరులు.. దక్షిణ ముంబయిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్మించిన స్మారకం వద్ద నివాళులు అర్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm