వికారాబాద్ : ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం చెందింది. బొంరాస్పేట మండలం హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బొంరాస్పేట గ్రామానికి చెందిన బ్యాగరి పద్మమ్మ (45) ఉదయం రోజువారీగా పరిగి పట్టణంలో కూలీ పనికి వెళ్లింది. సాయంత్రం బస్సులో ఇంటికి బయల్దేరింది. బొంరాస్పేట స్టేజీ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని యాద్గిర్కు వెళ్తున్న ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో టైరు కిందపడి ఘటనా స్థలంలోనే మృతిచెందింది.
Mon Jan 19, 2015 06:51 pm