హైదరాబాద్ : ఏపీలో 24 గంటల్లో 65,101 కరోనా టెస్టులు నిర్వహించగా 1,085 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 224 కొత్త కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో 142, పశ్చిమ గోదావరి జిల్లాలో 138, గుంటూరు జిల్లాలో 126, తూర్పు గోదావరి జిల్లాలో 116 కేసులు గుర్తించారు. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 10 మందికి కరోనా నిర్ధారణ అయింది. శ్రీకాకుళం జిల్లాలో 26, కర్నూలు జిల్లాలో 31, ప్రకాశం జిల్లాలో 42 కేసులు వచ్చాయి. అదే సమయంలో రాష్ట్రంలో 1,447 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు.
Mon Jan 19, 2015 06:51 pm